17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

యువకులకు వాలీబాల్ కిట్లను అందజేసిన ఎస్సై

21-10-2025 11:06 PM

పెద్ద పేటలో నిరుపేదకు బియ్యం అందజేత..

భీమిని (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమినీ మండలంలోని పెద్ద పేట గ్రామానికి చెందిన నిరుపేద మహిళ ఫాతిమాబీకి మంగళవారం 15 కేజీల బియ్యం, వంట సామాగ్రిని ఎస్ఐ విజయ్ కుమార్ అందించాడు. రాజారం గ్రామానికి చెందిన యువకులు ఆటలు కనబరుస్తున్న ఆసక్తిని గమనించిన ఎస్సై పిల్లలకు వాలీబాల్ కిట్లను అందించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ. యువకులు చదువుతో పాటు ఆటలో శ్రద్ధ కనబరిచి మంచి నడవడికతో మెదులుతూ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించి వాటిలోకి వెళ్లకుండా సన్మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ఆటల వల్ల శరీరధారోగ్యం పెరగడంతో పాటు మానసికంగా ఎంతో పరిణీతి సాధించడం కోసం ఆటలు ఉపయోగపడతాయని ఎస్ఐ అన్నారు. గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగిన నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించి సహకారం అందించాలని ఎస్ ఐ అన్నారు. ఎస్ఐ వెంట సిబ్బంది వినోద్ కుమార్ తదితరులున్నారు.