23 April, 2026 | 5:10 PM

Breaking News

అధికారంలోకి వచ్చాక విస్మరించడం తప్పు... జగ్గారెడ్డి సంచలన పోస్ట్   •   ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్   •   వన్యప్రాణుల క్రమ శిక్షణ   •   ఏటీఎంలో వ్యక్తి మృతదేహం.. మసబ్ ట్యాంక్‌లో కలకలం   •   3 గంటల వరకు తమిళనాడులో 70%, బెంగాల్‌లో 78.77% పోలింగ్‌ నమోదు   •   కాళేశ్వరంపై కాంగ్రెస్, BRS కుమ్మక్కయ్యాయి   •   అకాల వర్షంతో తడిసిన వడ్లు – ప్రభుత్వానికి రైతుల విజ్ఞప్తి   •   ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావం.. హైదరాబాద్‌కు వర్ష సూచన   •   ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి   •   పోలీసుల ఆంక్షల మధ్య రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె   •  

సైన్‌బోర్డులు పెట్టాలి

12-09-2024 12:00 AM

రాష్ట్రంలోని రహదారుల్లో చాలా చోట్ల ఏ మార్గం గుండా వెళ్తే ఏ ఊరు వస్తుందని తెలిపే సూచిక బోర్డులు అసలు లేవు. దీనివల్ల ఆ మార్గాల గుండా ప్రయాణించే కొత్త వాళ్లు తికమక పడుతున్నారు. దారిన వెళ్లే వారిని అడిగినా సరయిన సమాధానం లభించకపోవడంతో ఒక్కోసారి వేరే దారుల్లో వెళ్లి తిరిగి వెనక్కి రావలసిన పరిస్థితి వస్తోంది. వివిధ మార్గాల గుండా వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడకుండా తమ ప్రయాణం కొనసాగించడా నికి ఈ సూచిక బోర్డులు అత్యవసరమనే విషయాన్ని అధికారులు గ్రహించాలి.

అలాగే అక్కడక్కడ రోడ్లు దెబ్బతింటే మరమ్మతులు చేసే సిబ్బంది హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల చాలామంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు సైతం కో ల్పోతున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్య ధోరణిని విడనాడాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడెక్కడ సూచిక బోర్డులు అవసరమో గుర్తించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుకుంటున్నారు.

షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్