6 June, 2026 | 6:00 PM

Breaking News

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •  

భారీగా పెరిగిన వెండి ధర..

13-08-2024 01:43 AM

అదే బాటలో బంగారం..!

ముంబయి: సోమవారం దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.200 వృద్ధి చెంది రూ.72,350లకు చేరుకున్నది.మరోవైపు కిలో వెండి ధర సైతం రూ.1000 పెరిగింది. ఇంతకుముందు శనివారం సెషన్ లో తులం బంగారం (99.9 శాతం స్వచ్ఛత) ధర రూ.72,150 వద్ద నిలిచింది. శనివారం కిలో వెండి ధర రూ. 82,500 పలుకగా, సోమవారం రూ. 83,500లకు పెరిగింది. మరోవైపు తులం బంగారం (99.5 శాతం స్వచ్ఛత) ధర రూ. 200 పెరిగి రూ.72 వేల వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్ తోపాటు స్థానిక బులియన్ మార్కెట్లో ఆభరణాలకు గిరాకీ పెరగడం వల్లే బంగారం ధర పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.