26 June, 2026 | 6:20 PM

Breaking News

డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •   బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ట   •  

వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో వందేమాతరం గీతాలాపన

07-11-2025 10:37 PM

వందేమాతరం గీతం దేశభక్తికి శాశ్వత ప్రతీక, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): వందేమాతరం గీతం రచించబడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో విద్యార్థులతో కలిసి ముకుమ్మడిగా వందేమాతరం గీతాలాపన చేయడం జరిగింది. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని వేములవాడ రూరల్ ఎస్సై వెంకట్రాజం  తెలిపారు.

ఈ సందర్భంగా వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉత్సాహభరితంగా ఈ వేడుకలు జరుగుతున్నాయని, బంకీం చంద్ర చటర్జీ 1875 సంవత్సరంలో రచించిన ఈ గీతం స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణ ఇచ్చిందని,"వందేమాతరం"అనే మంత్రం అప్పటి యువతలో దేశభక్తిని రగిలించింది అని, ఈ గీతం భారత జాతీయ ఉద్యమానికి ఆత్మగా నిలిచిందని, ఇది కేవలం ఒక పాట కాదు ఇది దేశ ప్రేమ, త్యాగం, ఐక్యతలకు ప్రతీక అని సీఐ తెలిపారు.