calender_icon.png 8 November, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు ప్రజాసేవకు అంకితం కావాలి

07-11-2025 10:58:39 PM

రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కో-ఆర్డినేటర్ జీడి వీరస్వామి

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): అధికారులు ప్రజాసేవకు అంకితం కావాలని రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కో-ఆర్డినేటర్,కాంగ్రెస్ నాయకులు జీడి వీరస్వామి అన్నారు.శుక్రవారం జాజిరెడ్డిగూడెం మండల నూతన ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన పల్లపు ఝాన్సీని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో ఎంపీడీఓగా ఉద్యోగం సాధించి మండలానికి రావడం సంతోషకరమని,చిన్న వయస్సులో ఉద్యోగం సాధించిన ఝాన్సీ ముందుముందు అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.మండలంలో ఉన్న ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడంలో ముందుండి అంకితభావంతో పనిచేయాలని కోరారు.