12 June, 2026 | 12:02 PM

Breaking News

నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •   పగిడిద్దరాజు ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే పాయం చేయూత   •  

జనావాసాల్లోకి సర్పాలు అడవిలో విడుదల..

28-11-2025 01:05 AM

కొత్తగూడెం, నవంబర్ 27, (విజయక్రాంతి ): భద్రాద్రి కొత్తగూడెం లోని ప్రాణ ధార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్, రెస్క్యూ సభ్యుడు శ్రీకాంత్ (చోటు) కొత్తగూడెంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వచ్చిన పలు సర్పాలను, స్థానికుల సమాచారం మే రకు సురక్షితంగా వాటిని అదుపులోకి తీసుకొని వాటిపై స్థానిక ప్రజలకు,అవగాహన కల్పించిన అనంతరం గురువారం నాలుగు సర్పాలను (వాటిలో మూడు నాగుపాము లు ఉండగా ఒక జెర్రి పోతు పాము) దట్టమైన అటవీ ప్రాంతంలో విడుదల చేశారు.

హానీ జరగకుండా, చూడడమే తమ ఉద్దేశ్యమని,ఇళ్ల లోపలకి చేరకుండా తలుపులు కి టికీల కు జాలి అమర్చుకుంటే సమస్య ఉం డదని, సర్పాలు ప్రకృతిలో భాగమేనని వా తావరణంలో మార్పులు ఆహారం కోసమే, సర్పాలు బయటకు వస్తాయని ప్రత్యేకించి, చలి కాలంలో వెచ్చదనం కోసం ఇళ్ల లోపలికి వస్తాయని, రాత్రులు వెలుతురు ఉండే లా జాగ్రత్త పడాలని స్నేక్ క్యాచర్ సంతోష్ వివరించారు.