20 June, 2026 | 4:08 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

విద్యార్థినిల భద్రతపై విద్యసంస్థలలో ప్రత్యేక అవగాహన

28-11-2025 05:06 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే  ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్ బృందం ప్రతి రోజు జిల్లా పరిధిలో ఉన్న విద్య సంస్థలు సంద్రశిస్తూ గుడ్ టచ్/బ్యాడ్ టచ్/ర్యాగింగ్/ఇవిటీజింగ్/పోక్సో/షీటీమ్స్/మహిళ చట్టలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గంభిరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డిపేట గ్రామంలో ZPHS పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించి, వేధింపులకు గురైన వెంటనే 87126 56425  షీ టీమ్ కి ఫిర్యాదు చేయాలని, ఇటువంటి సంఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పిర్యాదు చేసినవారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని  అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏ. ఎస్.ఐ ప్రమీల, వీరయ్య, సిబ్బంది శ్రీలత, ప్రియాంక, శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.