17 July, 2026 | 6:47 AM

ఎంజీయూ ఎన్‌సీసీ విద్యార్థులకు స్పెషల్ క్యాంపు

22-07-2025 04:58 PM

నల్లగొండ క్రైమ్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(Mahatma Gandhi Institute of Technology) ఎన్‌సీసీ విద్యార్థులు 10 రోజుల ప్రత్యేక క్యాంపులో భాగంగా మంగళవారం మొదటి రోజు 31 బెటాలియన్ ఎన్‌సీసీ వార్షిక శిక్షణ క్యాంపు డీటీసీ రామ్ నగర్ లో నిర్వహించారు. పరేడ్, డ్రిల్ సామాజిక అవగాహన క్రమశిక్షణ పరిసరాల పరిశుభ్రత ప్రొటెక్షన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిపబ్లిక్ పరేడ్స్ అనే అంశాలపై నేర్చుకుంటారు. 10 రోజులు క్యాంపుల్లో విద్యార్థులు మెలకువలు నేర్చుకుంటారు. 31 బెటాలియన్ ఎన్‌సీసీ కామాండెంట్ ఆఫీసర్ టీ లక్షారెడ్డి, సుబేదార్ మేజర్ మాధవరావు, సుబేదార్ కొమ్ము మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.