15 June, 2026 | 7:55 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

యూరియా పంపిణీకి ప్రత్యేక అధికారులు

31-12-2025 01:57 AM

ఒక్కొక్కరికి నాలుగైదు జిల్లాల కేటాయింపు

వ్యవసాయ శాఖ డైరెక్టర్ బీ.గోపి

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : యాసంగి సీజన్‌లో యూరియా పంపిణీకి వ్యసాయ శాఖ డైరెక్టర్ డా.బీ. గోపి ప్రత్యేక అధికారులను  నియమించారు. జిల్లాల్లో యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా ప్రత్యేక అధికారులు మానిటరింగ్ చేయనున్నారు. ఇందులో భాగంగా అడిషనల్ డైరెక్టర్లు కే. విజయ్‌కుమార్, బీ.నర్సింహా రావు, జేడీఏలు ఎస్.గీత, వీ.ఆశాకుమారి, వై.సుచరిత, బీ.బాలు, ఎం.శైలజ, డీడీఏలు ఎం.చంద్రశేఖర్, ఎం.కనుక రాజులకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ప్రత్యేక అధికారికి నాలుగైదు జిల్లాలను కేటాయించారు. పైల ట్ ప్రాజెక్టు కింద యూరియా యాప్ కొనసాగుతున్న ఐదు జిల్లాల్లో కాకుండా మిగతా జిల్లాల్లో కూడా యూరియా సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోనున్నారు.