27 July, 2026 | 6:07 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం

31-12-2025 01:31 AM
  1. అసెంబ్లీలో హరీశ్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని
  2. మండలిలో ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
  3. మండలిలో విప్‌గా దేశపతి శ్రీనివాస్

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణ శాసన సభా శీతాకాల సమావేశాలు ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ, శాసన మండలిలో బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించారు. శాసన సభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా తన్నీరు హరీశ్ రావు, పటోల్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు అవకాశం కల్పించారు.

శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ అధికారిక ప్రకటన వెలువరించింది.