20-05-2025 12:00:00 AM
టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా
ముషీరాబాద్, మే 19 (విజయక్రాంతి): రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో రాణించాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రం మైసూర్ లోని ప్రసిద్ధిగాంచిన చాముండేశ్వరి అమ్మవారిని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీని వాస్ గు ప్తా సోమవారం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో రాణించాలని పూజలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ అధ్యక్షురాలు స్వప్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.