17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఘనంగా శ్రీ వాసవి జయంతి వేడుకలు

07-05-2025 01:36 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కేసముద్రం మండల ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటి అధ్యక్షులు వోలం సత్యనారాయణ వాసవి మాత చిత్రపటానికి పూలమాల సమర్పణ చేయగా, కేసముద్రం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తొనుపునూరి వెంకటేశ్వర్లు వాసవి పతాకావిష్కకరణ చేసి ఉత్సవాలు ప్రారంభించారు.

అనంతరం నిర్వహించిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసముద్రం మండలంలోని సమస్త ఆర్యవైశ్యలందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బిజ్జాల ప్రభాకర్, వోలం గోవర్ధన గిరి, తేరాల సమ్మయ్య, వోలం చంద్రశేఖర్, మంచన శంకర్రావు, వోలం శ్రీనివాస్, మంచన శ్రీనివాస్, తవిడిశెట్టి రవీందర్, బచ్చు లక్ష్మినారాయణ, కొత్తపల్లి శేఖర్, చిల్లంచర్ల సతీష్, మాలెరవి, వోమ సంతోష్, శ్రీరాం చంద్రన్ తదితరులు పాల్గొన్నారు.