06-12-2024 09:40:37 AM
హైదరాబాద్: ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఎస్డీఆర్ఎఫ్ వాహనాలు, బోట్లును సీఎం ప్రారంభిస్తారు. రెండు వేల మంది సిబ్బందితో ఎస్ డీఆర్ఎఫ్ ఏర్పాటవుతోంది. ఎస్ డీఆర్ఎఫ్ కు రూ. 35.03 కోట్లును ప్రభుత్వం మంజూరు చేసింది. విపత్తు సమయంలో బాధితుల రక్షణ కోసం ఎస్ డీఆర్ఎఫ్ పనిచేయనుంది. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా వైమానిక విన్యాసాలు చేపట్టనున్నారు. నేడు, ఎల్లుండి హుస్సేన్ సాగర్ పై వైమానిక విన్యాసాలు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 మధ్య వైమానిక విన్యాసాల కార్యక్రమం కొనసాగనుంది.