30 August, 2026 | 11:20 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ఫీజుల వసూలు ఆపండి

03-07-2025 01:33 AM

రీయింబర్స్‌మెంట్ అర్హులైన విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దన్న ఉన్నత విద్యామండలి

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు వసూలు చేయొద్దని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. ఆయా యూనివర్సిటీల పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు ఈమేరకు ఆదేశాలివ్వాలని పేర్కొంది. ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరుతున్న విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజును ఆయా కాలేజీలు వసూలు చేస్తున్నాయని అధికారులకు ఫిర్యాదులందడంతో రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దని హెచ్చరించింది.