6 July, 2026 | 3:52 PM

Breaking News

108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •  

ఫీజుల వసూలు ఆపండి

03-07-2025 01:33 AM

రీయింబర్స్‌మెంట్ అర్హులైన విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దన్న ఉన్నత విద్యామండలి

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు వసూలు చేయొద్దని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. ఆయా యూనివర్సిటీల పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు ఈమేరకు ఆదేశాలివ్వాలని పేర్కొంది. ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరుతున్న విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజును ఆయా కాలేజీలు వసూలు చేస్తున్నాయని అధికారులకు ఫిర్యాదులందడంతో రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దని హెచ్చరించింది.