6 July, 2026 | 2:51 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

ఆగస్టు 10న అంబేద్కర్ వర్సిటీ ఎంబీఏ ఎంట్రన్స్

03-07-2025 01:32 AM

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఆగస్టు 10న డా. బీ.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ, ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 15 అని పేర్కొన్నారు. ఆగష్టు 10న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు తెలంగాణ రాష్ర్టంలో ఉన్న నిర్దిష్ట పరీక్షా కేంద్రాల్లో మాత్రమే ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తారని పేర్కొన్నారు.

ఐ-సెట్ 2025లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఎంబీఏ  కోర్సుల్లో అడ్మిషన్స్ పొందొచ్చని వెల్లడించారు. లేకుంటే అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్వహించే ఎంబీఏ, ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) ఎంట్రన్స్ టెస్ట్-2025లోనైనా అర్హత సాధించిన అభ్యర్థులు ప్రవేశం పొందొచ్చన్నారు.