9 May, 2026 | 1:35 PM

Breaking News

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •  

శుభాంశు బృందం తిరుగుపయనం

15-07-2025 12:00 AM
  1. ఐఎస్‌ఎస్ నుంచి ‘డ్రాగన్’ వ్యోమనౌక అన్‌డాకింగ్ విజయవంతం
  2. నేడు మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియా సముద్ర జలాల్లో దిగనున్న వ్యోమనౌక
  3. వారం రోజుల పాటు క్వారంటైన్‌కు వ్యోమగాములు

న్యూఢిల్లీ, జూలై 14: యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)  నుంచి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యో మగాములు మరికొన్ని గంటల్లో భూమి మీదకు రానున్నారు. ఐఎస్‌ఎస్ నుంచి శు భాంశు బృందాన్ని తీసుకువస్తున్న ‘డ్రాగన్’ వ్యోమనౌక అన్‌డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. భారత కాలమాన ప్రకారం సా యంత్రం 4.35 గంటల సమయంలో డ్రాగ న్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రంతో విడిపోయింది.

అనంతరం వ్యోమనౌక దాదాపు 22 గంటల పాటు ప్రయాణించి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కా లిఫోర్నియా తీరానికి సమీపంలో సముద్ర జలాల్లో దిగుతుంది. అనంతరం శుభాంశు బృందాన్ని అక్కడి నుంచి క్వారంటైన్‌కు తరలిస్తారు. దాదాపు వారం రోజుల పాటు వ్యో మగాములు క్వారంటైన్‌లో ఉంటారు.

యాక్సియం-4 మిషన్‌లో శుభాంశు బృందం గత నెల 25న నింగిలోకి దూసుకెళ్లింది. వీరి బృందం దాదాపు 18 రోజుల పాటు 60కి పైగా ప్రయోగాలు చేసింది. విశ్వంలో జీరో గ్రావిటీలో మానవ కండరాలకు కలిగే నష్టం,జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న దానిపై పరిశోధనలు చేశారు.