1 July, 2026 | 6:53 PM

Breaking News

ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •  

ఘనంగా సురేఖమ్మ జన్మదిన వేడుకలు

21-11-2025 03:13 PM

మందమర్రి, (విజయక్రాంతి) : మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలో పీసిసి సభ్యులు నూకల రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూకల రమేష్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి డిసిసి అధ్యక్షురాలుగా సురేఖమ్మ పార్టీ విశేష కృషి చేశారని, జిల్లాలో మూడు నియోజక వర్గాలను అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారని ఆమె సేవలను కొనియాడారు. జిల్లాలో భారత్ జోడో యాత్ర, ఆజాద్ కి గౌరవ్ యాత్ర, రాజీవ్ సద్భావన యాత్ర, వంటి కార్యక్రమాలు వందల కిలో మీటర్లు చేపట్టి, పాదయాత్ర వంటి కార్యక్రమాలను విజయవంతం చేసి పార్టీని జిల్లాలో మూడు నియోజక వర్గాల్లో గెలుపునకు కృషి చేశారన్నారు. అహర్నిశలు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, పేద బడుగు బలహీనవర్గాల వారికి అండగా నిలిచారన్నారు. సురేఖమ్మ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మాజీ కార్యనిర్వా హక కార్యదర్శి ఎండి ముజాహిద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిద్ధం జనార్దన్, సీనియర్ జిల్లా నాయకులు నర్సోజీ, యువజన కాంగ్రెస్ నాయకులు నరేందర్, రంజిత్, నవీన్, కిరణ్, సతీష్, సురేష్, అనిరుద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.