10 May, 2026 | 7:01 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

స్వస్థ నారీ – శక్తివంత కుటుంబం

17-09-2025 05:20 PM

రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ వద్ద ఉన్న మండల్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “స్వస్థ నారీ – శక్తివంత కుటుంబ అభియాన్” కార్యక్రమాన్ని కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేష్ గారు డాక్టర్ కల్పన, సిబ్బందితో కలిసి ప్రారంభించారు. 

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మహిళలకు ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, యువతులకు ప్రత్యేక శ్రద్ధ, పోషకాహార లోపం నివారణ, అనీమియా తగ్గింపు, శానిటేషన్, మెన్స్ట్రుయల్ హైజీన్‌పై అవగాహన కల్పించనున్నారు. “ఆరోగ్యవంతమైన మహిళే కుటుంబ బలం – ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన పిల్లలే సమాజానికి శక్తి” అని కార్పొరేటర్ తెలిపారు.