20-06-2025 12:05:39 AM
గంభీరావుపేట, జూన్ 19 (విజయక్రాంతి) : మండలంలోని గజసింగవరం గ్రామంలో క్షయ వ్యాధి పై అవగాహన పెంపొందించేందుకు టి.బి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. లింగన్నపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. వేణుగోపాల్ రెడ్డి నే తృత్వంలో గజసింగవరం, సముద్రాలింగాపూర్ ఉప ఆరోగ్య కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా టి.బి సూపర్వైజర్ (STS) మహిపాల్ గారు మాట్లాడుతూ షుగర్, క్యా న్సర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కలిగినవారు మరియు పొగాకు సేవించే వారిలో క్షయవ్యాధి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారు తేమడ (స్పుటమ్) పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో 92 మం దికి టి.బి స్క్రీనింగ్ నిర్వహించగా, 18 మంది అనుమానితుల నుండి తేమడ నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. 22 మంది లక్షణాలతో ఉన్నవారిని సిరిసిల్ల మెడికల్ కాలేజ్ రేడియాలజీ ల్యాబ్కు ఎక్స్-రే కోసం రిఫర్ చేసినట్టు చెప్పారు. క్షయవ్యాధి నిర్ధారణఅయినవారి