24 March, 2026 | 7:56 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి

17-07-2025 09:31 PM

రామక్రిష్ణ  టీబీ నోడల్ పర్సన్

మునగాల: మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రo ఆధ్వర్యంలో జగన్నాధపురం గ్రామంలో నిక్షయ్ శివిర్  క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. టీబి నోడల్ పర్సన్ రామకృష్ణ మాట్లాడుతూ... వారానికి మించి దగ్గు దగ్గినప్పుడు కళ్ళేలో రక్తపు చారలు పడటం, చాతిలో నొప్పి, బరువు తగ్గడం రాత్రిపూట జ్వరంతో పాటు చమటలు రావడం, ఆకలి ముందగించడం. క్షయవ్యాధి సోకిన వారు ఆరు నెలలో మందులు వాడటం ద్వారా పూర్తిగా నయమవుతుంది.

దీనినీ నిర్లక్ష్యం చేయడం ద్వారా ఊపిరితిత్తులు  పూర్తిగా దెబ్బతిని మరణించవచ్చు. ముందు జాగ్రత్తగా ప్రజలకు వ్యాధి పట్ల అవగాహన కల్పించి పౌష్టికాహారం తీసుకోవాలని తెలియజేశారు. క్షయవ్యాధి సోకిన వారికి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి ప్రభుత్వం నుండి ఉచితంగా ఆరు నెలలు న్యూట్రిషన్ ఫుడ్ బాస్కెట్లు అందిస్తున్నాము,. ప్రజలు ప్రతి ఒక్కరూ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.