29-11-2024 12:00:00 AM
కాన్బెర్రా: బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా బృందం ఆ దేశ ప్రధాని ఆంథోని అల్బానీస్తో మర్యాద పూర్వకంగా భేటీ అయింది. రెండో టెస్టుకు సమయం ఉండడంతో ఈ నెల 30 నుంచి భారత జట్టు ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ జట్టుతో రెండు రోజుల పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
ఈ నేపథ్యంలో గురువారం రోహిత్ ఆధ్వర్యంలోని టీమిండియా ప్రాక్టీస్కు ముందు ప్రధానితో ఫోటో సెషన్లో పాల్గొం ది. ఈ సందర్భంగా ప్రొటోకాల్ ప్రకారం కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు సభ్యులను పరిచయం చేశాడు. అనంతరం భారత ఆటగాళ్లతో కరచాలనం చేసిన ప్రధాని సరదాగా ముచ్చటించా డు. ఈ సందర్భంగా పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియాను అభినందనల్లో ముంచెత్తాడు.
తొలి టెస్టులో సెంచరీలు చేసిన కోహ్లీ, జైస్వాల్తో ప్రత్యేకంగా ముచ్చ టించిన ఆంథోని అల్బానీస్ ఆ తర్వాత బుమ్రాపై పొగడ్తల వర్షం కురిపించాడు. గతేడాది భారత్కు విచ్చేసిన ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బానీస్తో కలిసి అహ్మదాబాద్ స్టేడియానికి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత్, ఆసీస్ ఆటగాళ్లతో కరచాలనం చేశారు.