6 June, 2026 | 9:55 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

రాబోయే రోజుల్లో సాంకేతిక విద్య కీలకం

11-10-2025 12:00 AM

నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

కల్వకుర్తి అక్టోబర్ 9: రాబోయే రోజులు పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా మారిపోతున్నాయని, ఈ నేపథ్యంలో సాంకేతిక విద్య చాలా కీలకమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం కల్వకుర్తి ఐటిఐ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ ను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులు శ్రద్ధగా, క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేసుకోవాలని, నేర్చుకున్న నైపుణ్యాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

సాంకేతిక విద్య ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కూడా విస్తరించాయని, కేవలం ఉద్యోగాల కోసం కాకుండా కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ప్రయత్నించాలన్నారు, స్వయం ఉపాధి యజమానులుగా ఎదగాలనే ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని తెలిపారు. అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్లు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను చేరువ చేస్తున్నాయన్నారు.

శిక్షణ పొందుతున్న విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం ఏటీసీ సెంటర్లో ఎంత మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ జయమ్మ, కల్వకుర్తి తహసిల్దార్ ఇబ్రహీం, ఏటీసీ కోఆర్డినేటర్, ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులుపాల్గొన్నారు.