15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు

05-11-2025 06:06 PM

ఆళ్ళపల్లి (విజయక్రాంతి): బుధవారం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని వివిధ గ్రామాలలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా భక్తులంతా తెల్లవారుజామున గ్రామ సమీపంలోని కిన్నెరసాని చేరుకొని నది స్నానాలు ఆచరించి అరటి మట్టలతో కార్తీకదీపాలు వెలిగించి వాగులో వదిలారు. అనంతరం సమీపంలోని ఆలయాలకు చేరుకొని 365 వత్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హైందవులకు కార్తీక మాసం ప్రత్యేకమైనది కావడంతో ఈ మాసం మొత్తం ఎంతో నిష్టగా పూజా కార్యక్రమాల ఈ మేరకు మండల కేంద్రంలోని రామాలయం, ఎల్లమ్మ ఆలయం, మర్కోడులోని రామాలయం, దుర్గమ్మ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక్క పొద్దులతో సమీపంలోని పుట్ట వద్దకు చేరుకొని నాగదేవతకు పాలు పోసి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అలాగే ఉత్సవ కమిటీతో పాటు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.