28 June, 2026 | 2:11 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

తిరుమలగిరిలో ఇంటిగ్రేటెడ్ భూమి పూజలో ఉద్రిక్తత

17-10-2025 03:02 PM

పెట్రోల్ తో రైతులు ఆందోళన, అరెస్ట్ చేసిన పోలీసులు

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం(Tirumalagiri Mandal) తొండ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల సుమారు 200 కోట్లతో నిర్మాణం తలపెట్టిన పాఠశాలకు శంకుస్థాపన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు పాల్గొనగా, ఉద్రిక్త నెలకొంది. తమ భూములు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ భాగిత రైతులు భూమి పూజ కార్యక్రమం వద్దకు వచ్చి, పోలీస్ వాహనాలకు ఎదురు వెళ్లి, నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ భూములు లాక్కుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని పలువు రైతులు ఆందోళనకు దిగారు. జరిగిన సంఘటనపై రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు