17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ముద్దాయి వద్దకే వచ్చి అభియోగాలు నమోదు

03-05-2025 02:06 AM

నిజామాబాద్ మార్చ్ 2: (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ చెందిన బండి సురేష్ తోపాటు ఇతరుల పైన అతని భార్య 498 ఏ సెక్ష న్ తో పాటు మానసిక శరీరక వేధింపులు అదనపు కట్నం ఆరోపణపై కేసు నమోదు అయింది.  రెండు లక్షలు అదనంగా కట్నం డబ్బులు తేవా లని వేధిస్తున్నారనే ఆరోపణపై కోర్టులో కేసు దాఖలు చేశారు.  గురువారం పై కేసు విషయమై కోర్టుకు హాజరు కావలసి ఉండం తో కోర్టు కు చేరుకున్నారు.

నేరారోపణ ఎదురుకుంటున్న 60 ఏళ్ల వృద్ధ మహిళ అనసూయ నడవడం సరిగ్గా చేతకాక పోవడంతో మెట్లు ఎక్కడం కష్టతరంగా మారడంతో వారి తరఫున న్యాయవాది ఎర్రం విగ్నేష్ ముద్దాయి ఆరోగ్య సమస్యను  తెలుసుకున్న సంబంధిత న్యాయమూర్తి నిజామాబాద్ రెండవ అదనపు జ్యుడీషియల్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి పాముజల శ్రీనివాసరావు జిల్లా కోర్టు మొదటి అంతస్తు లోగల కోర్టు హాలు నుండి దిగివచ్చి  కింద ఆవరణలో ఆటో లో ఉన్న ముద్దాయి అనసూయ వద్దకు వెళ్లి కేసు పూర్వపరాలు బాధితురాలికి తెలియపరచి నేరా అభియోగాలు నమోదు చేశారు.