14 April, 2026 | 5:15 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

పెన్షనర్ల బకాయిలు, డీఏలు వెంటనే విడుదల చేయాలి

19-12-2025 12:00 AM

సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ 

సిద్దిపేట క్రైం, డిసెంబర్ 18 : పెన్షనర్ల బకాయిలు, డీఏలు వెంటనే విడుదల చేయాలని పెన్సనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సంఘం జిల్లా ఎన్నికలు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగాయి. ఎన్నికల పరిశీలకులుగా చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. పెన్షనర్లకు నగదురహిత వైద్య చికిత్సను సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

పెన్సనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాగుల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జైన సత్యం ఆర్థిక కార్యదర్శిగా రామకిష్టయ్య, సహాధ్యక్షుడిగా రాజేశం, ఉపాధ్యక్షులుగా కృపాసాగర్, జానకిరాములు, ప్రేమలత, కార్యదర్శులుగా బాలకృష్ణారెడ్డి, గోపాల్, నిర్వహణ కార్యదర్శులుగా రాజగోపాల్ రావు, రాఘవరెడ్డి, లక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ప్రచార కార్యదర్శిగా మల్లయ్య, రాష్ట్ర కౌన్సిలర్లుగా వెంకట రాములు, దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు పెన్షనర్లు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు.