12 June, 2026 | 2:44 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

మొక్కుబడిగా పనిచేయొద్దు..

19-12-2025 12:00 AM

జిల్లా కలెక్టర్ హైమావతి 

సిద్దిపేట, డిసెంబర్ 18 (విజయక్రాంతి): నారాయణరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి గురువారం సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉద్యోగుల అటెండెన్స్, ఓపి రిజిస్టర్ వెరిఫై చేశారు. ఓపి రిజిస్టర్ రాయడం సరిగ్గా లేనందున అసహనం వ్యక్తం చేశారు. రికార్డు చక్కగా మెయింటెన్ చెయ్యాలని ఏదో మొక్కుబడిగా రాస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

పిఎచ్ సిలో మైనర్ రి పేర్లు త్వరగా పూర్తి చేయించేలా కాంట్రాక్టర్ తో మాట్లాడాలని మెడికల్ ఆఫీసర్ కు తెలిపారు. పై హెచ్ సీ లో మెడిసిన్, వైద్య పరికరాలు అన్ని ఉండేలా చూసుకోవాలని, రోగులకు మెరుగైన చికిత్స అందించేలా మెడికల్ ఆఫీసర్, సిబ్బంది పని చెయ్యాలని ఆదేశించారు. అనంతరం నారాయణరావుపేటలో గల ఆయుష్ ఆరోగ్య మందిర్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఆయుష్ కేం ద్రంలో చేస్తున్న సేవలు గురించి ఆరా తీశారు. ఆయుష్ సేవలు విస్తరించాలని డాక్టర్ కి తెలిపారు.