17 April, 2026 | 10:34 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

యరగని గురవయ్య మరణం తీరని లోటు

19-05-2025 12:00 AM

హుజూర్‌నగర్, మే 18: హుజూ ర్‌నగర్ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ యరగాని గురవయ్య బ్రెయి న్ స్ట్రోక్ తో హైదరాబాద్ గ్లోబల్ ప్రైవేట్ హాస్పిటల్లో మరణించడం జరిగింది.ఈ విషయం తెలిసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  దిగ్భ్రాంతికి గుర య్యారు. మంత్రి  హుజూర్నగర్ చేరు కొని మాజీ కౌన్సిలర్ యరగని గురవ య్య పార్థివదేహం పై మూడు రంగుల జెండా ఉంచి, పూలమాలవేసి  నివాళులర్పించారు.

అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ  యరగని గురవయ్య మరణం పార్టీకి తీరని లోటని మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని,అలాంటి వ్యక్తి ఈరోజు మనకు దూరం అవటం చాలా బాధాకరమని అన్నారు. యరగని గురవయ్య   కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

యరగని గురవయ్య  కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా  ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాముల శివారెడ్డి, యరగాని నాగన్న, తన్నీరు మల్లికార్జున్,గెల్లి రవి అమరబోయినసతీష్, వీర్లపాటి భాస్కర్, యడ్ల విజయ్,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.