17-05-2025 01:21:04 AM
మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించాలి
-అరుణోదయ సాంస్కృతి సమైక్య గౌరవాధ్యక్షురాలు విమలక్క
ముషీరాబాద్,16 (విజయక్రాంతి): సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించి, సింగరేణి కుటుంబ వారసులను ఆదుకోవాలని అరుణోదయ సాంస్కృతి సమైక్య గౌరవాధ్యక్షు రాలు విమలక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సింగరేణి కార్మికుల కుటుంబ పిల్లలు మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు అరుణోదయ విమలక్క, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావులు హాజరై మాట్లాడారు.
సింగరే ణి సంస్థల లో గత 30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకొని అనారోగ్య కారణాల వలన కార్పొరేట్ మెడికల్ బోర్డు వారిచే మెడికల్ ఇన్వాలి డేట్ అయ్యి డిపెండెంట్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారని, విజిలెన్స్ అధికారులు ఈ దరఖాస్తు దారులు మారు పేర్ల పై ఉద్యోగం చేశారని, రెండు పేర్లు ఉన్నాయనే కారణంతో దరఖాస్తు చేసుకున్న వారికి డిపెండెంట్ ఉద్యోగము ఇవ్వకుండా గత 15 సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
సకాలంలో సింగరేణి ఉద్యోగం రాక ఎలాంటి ఉపాధి మార్గం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ కుటుంబ పోషణ భారంగా వెళ్ళదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మారుపేర్ల సమస్యను పరిష్కరించి విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని సింగరేణి యాజమాన్యం కార్మిక జాతీయ సంఘాలు కలిసి లేబర్ కమిషన్ ఆర్ఎల్సి వారి సమక్షంలో ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నా రు. అందువలన రాష్ట్ర ప్రభుత్వం దయ తలచి వీరి ఇబ్బందులను అర్థం చేసుకొని సత్వరమే ఉద్యోగ నియామకం కల్పించి సింగరేణి కుటుంబ వారసు లను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మారు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులు శ్రవణ్, తిరుమల శ్రీనివాస్, ప్రదీప్ వర్మ, ఓం ప్రకాష్, రాజయ్య, డిష్ బాబు, శ్రావణ్, కొమరమ్మ పాల్గొన్నారు.