26-01-2026 12:27:26 AM
కంగ్టి, జనవరి 25:తాండ ప్రజల సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తానని తాండ సర్పంచ్ ప్రకాష్ అన్నారు. కంగ్టి మండలంలోని ముకుంద నాయక్ తండాలో ఆది వారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. విద్యు త్ స్తంభాలకు బల్బులు వేయించారు .
ట్రాక్ట ర్ తో పిచ్చి మొక్కలను తొలిగించారు. మురి కి కాలువలు శుభ్రం చేయించారు. ప్రతి ఒక్క రు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉం చుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజలు భాగస్వాములు అయితేనే అభివృద్ధి సాధ్యమైతుందని, అందరి సహకారం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలొ ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.