04-08-2025 10:53:59 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..
నకిరేకల్ (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలోనే పేద ప్రజల స్వంత ఇంటి కల నేరవేరుతుందనీ అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) అన్నారు. సోమవారం నకిరేకల్ మండలంలోని గోరెంకలపల్లి గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, వీరా అర్జున్ రెడ్డి, చెట్టిపళ్లి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.