13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఉమ్మడి జిల్లాను కమ్మేసిన పొగమంచు

03-01-2026 12:00 AM

 రహదారులపై నిలిచిపోయిన వాహనాలు

కరింనగర్, జనవరి2 (విజయక్రాంతి): ఉమ్మడి కరింనగర్ లోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున కురిసిన దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందు లు పడ్డారు. తాజివ్ రహదారి తో పాటు పలు రహదారుల వెంట వహణవ్రకపోకు అంతరాయం ఏర్పడింది. కరింనగర్ శివారులోని  గ్రామాల్లో  పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అతి సమీపంలోని వాహనాలు సైతం కనిపించక వాహనదారులు నెమ్మదిగా వాహనాలు నడిపారు.

రాజీవ్ రహదారి వెంట కొద్దిసేపు వాహనాలు నిలిచి పోయాయి. హెడ్ లైట్ల వెలుగులో ప్రయాణాలు సాగించారు. .. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని రహదారులపై పొగమంచు పేరుకుపోయింది. ఉదయం ఎనిమిదన్నర గంటల వరకు పొగమంచు అలాగే ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

 హైవేలపై వెళుతున్న వాహనదారులకు ముందున్న దారి కనిపించకుండా పొగమంచు కమ్ముకుంది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ నుంచి జగిత్యాల, వరంగల్ వెళ్లే రహదారిలో పొగమంచు పేరుకుపోయింది. అలాగే హుజురాబాద్లోని చాలా గ్రామాల్లో పొగ మంచు పేరుకుపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు.

మానకొండూర్ నియోజక వర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లో  శుక్రవారం పొగమంచు కమ్మేయడంతో  వేకువజామున వివిధ పనులకు వెళ్లే కార్మికులు, రైతులు, వాకింగ్కు వెళ్లిన వారంతా ఇక్కట్లకు గురయ్యారు. వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై పొగమంచు దుప్పటి కప్పేయడంతో వాహన చోదకులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దీంతో వాహన దారులు హెడ్లైట్లు వేసుకొని రాకపోకలు సాగించారు.  పొగమంచు దట్టంగా కురుస్తోన్న వేళ కూడళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని.. అప్రమ త్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.