4 July, 2026 | 11:13 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం

04-08-2025 07:16 PM

నిర్మల్ (విజయక్రాంతి): జనాభా ప్రాతిపాదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు సిపిఎం పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెస్లీ(CPI leader John Wesley) అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి 42 శాతం రిజర్వేషన్ కోసం  కులాల బీసీలతో జేఏసీ ఏర్పడి పోరాటం చేస్తామని తెలిపారు. బీసీల రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెరిగితేనే రాజ్యాధికారం దక్కుతుందని అందుకు బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నూతన కుమార్ గౌతమ్ సురేష్ శంభు పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.