11 May, 2026 | 1:28 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

స్థానిక పోరుకు సర్కార్ సిద్ధం!

21-09-2025 12:18 AM
  1. పీసీసీ చీఫ్, మంత్రులతో సీఎం సమావేశం
  2. దాదాపు గంటపాటు చర్చ
  3. ప్రభుత్వ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. లోకల్ ఎన్నికల నిర్వహణపై శనివారం అం దుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక సమావేశం నిర్వ హించారు. దాదాపు గంటపాటు సాగిన చర్చలో ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

సెప్టెంబరు నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎంతో జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారా వు, సీతక్క తదితరులు పాల్గొన్నారు.