17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కంగారూలను ఊడ్చేశారు

09-10-2025 12:20 AM

భారత్ అండర్ 19 జట్టు ఘనవిజయం

మెక్‌కే, అక్టోబర్ 8: భారత అండర్ 19 జట్టు కంగారూ గడ్డపై దుమ్మురేపింది. యూత్ వన్డే సిరీస్ తో పాటు యూత్ టెస్ట్ సిరీస్ ను సైతం స్వీప్ చేసింది. రెండురోజుల్లోనే ముగిసిన రెండో యూత్ టెస్టులోనూ ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.బౌలర్ల హవా కొనసాగిన ఈ మ్యాచ్ లో కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడం భారత్ విజయానికి కారణమైంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ అండర్ 19 జట్టు  135 పరుగులకే ఆలౌటైంది.

తర్వాత తొలి ఇన్నింగ్స్ లో భారత్ 171 పరుగులు చేయడంతో 36 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లోనూ భారత యువ బౌలర్లు అదరగొట్టారు. కంగారూ కుర్ర టీమ్ ను కేవలం 116 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 81 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ తడబడినా వేదాంత్ త్రివేది(33), విహాన్ మల్హోత్ర(21) రాహుల్ కుమార్ (13) రాణించడంతో ఛేదించింది. అంతకుముందు యూత్ వన్డే సిరీస్ ను కూడా భారత్ స్వీప్ చేసింది.