15 June, 2026 | 7:05 PM

Breaking News

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •  

ఉమామహేశ్వర ఆలయ అభివృద్ధే ప్రధాన లక్ష్యం

18-11-2025 12:00 AM

అచ్చంపేట ఎమ్మెల్యే  డా.వంశీకృష్ణ

అచ్చంపేట, నవంబర్ 17: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉమామహేశ్వర ఆలయ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నానని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ తెలిపారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయంలోని పార్వతి, పరమేశ్వరులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, శివునికి అభిషేక పూజలు చేశారు.  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆలయ సమీపంలోని కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు.

అలాగే కార్యనిర్వాహణ అధికారి కార్యాలయం, యాగశాల గదులు ధ్వంసం కావడంతో వాటిని కూల్చివేసి త్వరలోనే కొత్తవి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని. దాని గురించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. ఆలయాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సంబంధిత మంత్రులు, అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపడుతామని చెప్పారు. ఉమామహేశ్వర దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు.

దీంతో పాటు ఇకపై ఆలయానికి వచ్చే భక్తులకు ఉచితంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే అటవీశాఖ ఏర్పాటు చేసిన టోల్ గేట్ ను తొలగించేలా చూస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బీరం మాధవరెడ్డి, మామిళ్ళపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ నరసింహారావు, ఈవో శ్రీనివాసరావు,  పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.