23 June, 2026 | 7:46 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన ఎంపీ

15-12-2025 12:16 AM

కొమురవెల్లి, డిసెంబర్ 14 నూతనంగా నిర్మించిన కొమురవెల్లి రైల్వే స్టేషన్ను మెదక్ ఎంపీ ఏం రఘునందన్ రావు పరిశీలించారు. పనులు పూర్తయిన ఎందుకు ప్రారంభించడం లేదని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో ఫోన్లో ప్రశ్నించారు. ఇందుకు రైల్వే అధికారులు స్పందిస్తూ రైల్వే మినిస్టర్ దృష్టికి తీసుకుపోయామని, రైల్వే మంత్రి కార్యాలయం నుంచి సమాచారం వచ్చిన వెంటనే ప్రారంభిస్తామని బదులిచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు పార్లమెంట్ సేషన్ జరుగుతున్నందున, ఈ సేషన్లోనే రైల్వే మినిస్టర్ ను కలిసి త్వరలోనే స్టేషన్ను ప్రారంభించడానికి చర్యలు చేపడతామని తెలిపారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, స్థానిక బిజెపి నాయకులు దండ్యాల లక్ష్మారెడ్డి, బూర్గోజు స్వరూప తదితరులు పాల్గొన్నారు