17 April, 2026 | 9:45 PM

Breaking News

అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •  

మట్టి తొలగించి రాకపోకలు పునరుద్ధరించాలి

20-05-2025 05:08 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణం మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ దాటేందుకు అండర్ డ్రైనేజీలో ఉన్న మట్టిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. కాజీపేట విజయవాడ సెక్షన్ లో మూడో రైల్వే లైన్ నిర్మాణం కోసం కొంతకాలం క్రితం మూడో లైన్ నిర్మాణ ప్రదేశంలో కల్వర్ట్ నిర్మాణం కోసం అండర్ డ్రైనేజీ నుండి రాకపోకలు పెట్టు వేశారు. ఇటీవల కొత్తగా మూడో లైన్ వేయడానికి అండర్ డ్రైనేజీ వద్ద కల్వర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే అందులో నుండి రాకపోకలు సాగించకుండా ఇరువైపులా మట్టి కుప్పలు పోశారు. అండర్ డ్రైనేజీ కల్వర్టు నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో మట్టి తొలగిస్తే ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు రైల్వే ట్రాక్ దాటడానికి అనువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. రైల్వే ఇంజనీరింగ్ అధికారులు స్పందించి మట్టి తొలగించి రాకపోకలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.