13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

పట్టణ ఓటర్లు 51.92 లక్షలు

13-01-2026 01:52 AM

మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఓటర్ల జాబితా విడుదల

20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల?

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను ఖరారు చేసింది. 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లలో 51,92,220 మంది ఓటర్లు ఉన్నట్లుగా సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 25,37,136 మంది పురుషులు, 26,54, 453 మంది మహిళలు, 631 మంది థర్డ్ జండర్ ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఈ నెల 20న 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.