13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

నా కుటుంబంపై ఆరోపణలు పట్టించుకోను

13-01-2026 02:28 AM

మంథని అభివృద్ధే లక్ష్యం

ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

మంథని, జనవరి 12 (విజయక్రాంతి): ‘నా కుటుంబంపై అనవసరపు ఆరోపణలు చేస్తున్న వారిని పట్టించుకోను. మంథని ప్రాంత అభివృద్ధి ఆశయంగా ముందుకు సాగుతా’అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.  సోమవారం మంథనిలో ఇందిరమ్మ లబ్ధిదారులకు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాలలో ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపించుకోవడం సహజమని, కానీ తన కుటుంబంపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్న కొంతమందికి తాను పట్టించుకోనని తెలిపారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన మంత్రి నియోజకవర్గ ప్రజలను మర్చిపోనని, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నానని, దీంతో పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాన్నానని అన్నారు.

ఇప్పటివరకు మంథని పట్టణంలో దాదాపు రూ.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశానని, అన్ని కుల సంఘాలకు భవనాలు మంజూరు చేశానని, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వారికి కూడా నిధులు మంజూరు చేస్తానన్నారు. ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళు ఆందోళన పడద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. రాజకీయాలలో తన పేరు తలవందే కొంతమందికి పూట గడవదని, అటువంటి వారికి ప్రజలే రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారన్నారు.