17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఎన్టీవీ, ప్రైమ్-9లపై క్రిమినల్ కేసులు

13-01-2026 01:55 AM

తెలుగు స్క్రుబ్, మిర్రర్ టీవీ, సిగ్నల్ టీవీలపైనా కేసులు

పోలీసులకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12 (విజయక్రాంతి): రాష్ర్టంలో సంచలనం సృష్టిం చిన ఓ మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారికి సంబంధించిన వ్యవహారంలో నిరాధారమైన వార్తలు ప్రసారం చేశారంటూ ఐఏఎస్ అసోషియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవ న్నీ పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం బురదజల్లేందుకే ఈ దుష్ర్పచారం చేస్తున్నారని అసోసియేషన్ తరఫున రాష్ర్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. జయేష్ రంజన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎన్టీవీ, ప్రైమ్-9 న్యూస్ చానళ్లతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన తెలుగు స్క్రుబ్, మిర్రర్ టీవీ, సిగ్నల్ టీవీ తదితర హ్యాండిల్స్‌పై కేసులు నమోదు చేశారు.

నిరాధారమైన ఆరోపణలతో మహిళా అధికారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, మంత్రి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించినందు కు గాను ఐపీసీ, బీఎన్‌ఎస్ చట్టాల ప్రకారం కఠిన సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు సమాచారం. మీడియా స్వేచ్ఛ పేరుతో ఇష్టారీతిన వ్యవహరిస్తే సహించేది లేదని ప్రభుత్వ వర్గా లు, ఐఏఎస్ అసోసియేషన్ ఈ సందర్భంగా హెచ్చరించాయి.