24-01-2026 12:00:00 AM
ఉప్పల్ జనవరి 23విజయక్రాంతి : కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని ఉప్పల్ శాసన సభ్యులు బండారు లక్ష్మారెడ్డి అన్నారు. నాచారం డివిజన్లోని శ్రీరామ నగర్ లో ఉంటున్న బిఆర్ఎస్ కార్యకర్త టేకుల రామచందర్ గత కొంత క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఇటీవల కాలంలోఆరోగ్యం మెరుగుపడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రామచంద్ర ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తల బలమని అలాంటి కార్యకర్తల బాగోగులు చూసుకోవడం తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు సాయి జన్ శేఖర్ మెడల మల్లికార్జున గౌడ్ విట్టల్ యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారు