13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

పంట రుణమాఫీ హామీతో అసలుకే మోసం

13-01-2026 12:00 AM
  1. రుణమాఫీ కాకపోవడంతో పెరుగుతున్న వడ్డీ 
  2. అర్హులైన వారందరికీ రుణమాఫీ చేయాలని డీఏఓకు వినతిపత్రం 
  3. లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రైతుల స్పష్ఠీకరణ

మేడ్చల్, జనవరి 12 (విజయ క్రాంతి): అర్హులైన వారందరికీ పంట రుణ మాఫీ చేయాలని పలువురు రైతులు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళకు వినతిపత్రం అందజేశారు. సొసైటీలలో పంట రుణమాఫీ సగం మందికే చేశారని, మిగతా వారికి చేయలేదని తెలిపారు. మేడ్చల్, డబిల్పూర్, పూడూరు సొసైటీల మాజీ అధ్యక్షులు రణదీప్ రెడ్డి, సద్ది సురేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు రైతులు కలెక్టరేట్ కు వచ్చి వినతిపత్రం సమర్పించారు. డబిల్పూర్ సొసైటీలో 668 మందికి అర్హత ఉండగా 341 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని మిగతా 300 మందికి రుణమాఫీ కాలేదని తెలిపారు.

మేడ్చల్ సొసైటీలో 449 మందికి అర్హత ఉండగా 351 మందికి రుణమాఫీ అయిందని మిగతా 129 మందికి రుణమాఫీ కావలసి ఉందని తెలిపారు. పూడూరు ఎఫ్‌ఎసిఎస్ పరిధిలో 650 మందికి అర్హత ఉండగా 210 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, 440 మందికి రుణమాఫీ కాలేదని వారు పేర్కొన్నారు. డబిల్ పూర్ ఎస్బిఐ పరిధిలో 400 పైన రైతులకు రుణమాఫీ కావలసి ఉందన్నారు.

రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తూ రుణాలు చెల్లించలేదని దీంతో ఎకౌంట్‌లు హోల్‌లో పెట్టారని తెలిపారు. అంతేగాక వడ్డీ ఏడు శాతానికి బదులు 11% పడుతుందని తెలిపారు. రుణమాఫీ పథకం తమను అసలుకే మోసం చేసిందని తెలిపారు. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు స్పష్టం చేశారు.