1 July, 2026 | 8:59 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పెండ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్

22-05-2025 12:09 AM

అనాథ యువతికి ఘనంగా వివాహం

టీఎన్జీవో సేకరించిన రూ. 61.8 వేల చెక్కు అందజేత

మానస- రాజేష్‌ల కల్యాణంలో స్థానిక ఎమ్మెల్యే ఆశీర్వాదాలు 

పెద్దపల్లి, మే21 (విజయ క్రాంతి) అనాథ యువతి పెండ్లి పెద్దగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్వర్యంలో బుధవారం బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని  శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో  తలపెట్టిన మానస- రాజేష్ ల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది.

తబిత బాలల సంరక్షణ సంస్థ పుత్రిక చి.ల.సౌ. యన్.మానస, రేణుక యాకయ్య ఏకైక పుత్రుడు యమ్. రాజేష్ కళ్యాణం బుధవారం  ఉదయం 11 గంటల 5 నిమిషాల సుముహూర్తం న ఘనంగా నివాళులర్పించారు.ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక ఎమ్మెలే చింతకుంట విజయరమణారావు,  డిసిపి కరుణాకర్,  అదనపు కలెక్టర్ డి.వేణు టి ఎన్ జి ఓ అధ్యక్షులు బొంకురి  శంకర్ .జిల్లా ఉన్నతాధికారులు అధికారులు బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.నేడు పెళ్లి చేసుకుంటున్నా నూతన వధూవరుల కోసం జిల్లాలోని టీఎన్జీవో సంఘం సేకరించిన  రూ. 61 వేల 800  రూపాయల చెక్కును కలెక్టర్  అందించారు.