27 June, 2026 | 7:30 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.. అన్నదానం

22-05-2025 05:10 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో హనుమాన్ జయంతి(Hanuman Jayanti) వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా కన్నాల మెయిన్ హైవే పంచముఖ శివాంజనేయ విగ్రహం వద్ద ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై పూజలు చేశారు. కమిటీ అధ్యక్షులు సాంభాశివ రావు, కమిటీ సభ్యులు విగ్రహం వద్ద అన్నదానం చేశారు. టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి(TPCC State Campaign Committee Convener Nathari Swamy), డీసీసీఓబీసీ కో చైర్మెన్ బండి లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆసం అఖిల్ ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ కౌన్సిలర్ చింతపండు శ్రీనివాస్, బొడ్డు నీలవర్మమూర్తి, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.