07-01-2026 12:00:00 AM
ఎంపీ రఘునందన్ రావు
తూప్రాన్, జనవరి 6: మెదక్ జిల్లా తూప్రాన్ బిజెపి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు మంగళవారం తూప్రాన్ లో కట్ చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశం బాగుండాలని ఆహార్నిశలు పనిచేస్తున్న ప్రధాన మంత్రి మోడీని ఆదర్శంగా తీసుకొని నాయకులు కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నాయకులు ఒకరిపై ఒకరు సాకులు చెప్పడం కాకుండా కలిసి పనిచేయడం వల్ల ఫలితాలు సాధిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామ్మోహన్ గౌడ్, మల్లేష్, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్, సాయి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.