15-10-2025 12:22:47 AM
ఉప్పల్, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : ఉప్పల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులో చోరీ జరిగిన సంఘటన ఉప్పర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద తొర్రూర్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ రాజధాని బస్సులో డ్రైవర్ నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని అగాంతకులు బస్సులోకి చొరబడి నిద్రిస్తున్న డ్రైవర్ల నగతు 5000 ఐడి కార్డు లు సెల్ఫోన్లు దొంగలించారు. ఈ ఘటనపై బాధితులు ఉప్పల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.