15 March, 2026 | 8:20 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

తృతీయ వార్షిక ఏకాదశి యజ్ఞం ప్రారంభం

03-10-2025 11:00 PM

నకిరేకల్,(విజయక్రాంతి): కట్టంగూర్ మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో గత రెండు సంవత్సరాలు ఏకాదశి మహా యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని నేడు తృతీయ వార్షిక ఏకాదశి మహా యజ్ఞాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆలయ పూజారి రామడుగు శ్రీనివాస శర్మ, శశిరేఖ దంపతుల ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ స్వామి ఉత్సవమూర్తులకు అభిషేకాలను నిర్వహించారు. అనంతరం యజ్ఞాన్ని నిర్వహించి తీర్థ ప్రసాద పంపిణీ చేశారు. ఎంతో ముక్తిని ప్రసాదించి ఏకాదశి మహా యజ్ఞం ఏడాది పాటు నిర్విఘ్నంగా నిర్వహించడం విశేషమని భక్తులు యాగంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని పూజారి తెలిపారు. ప్రతిపక్షం రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి హోమంలో పాల్గొనేందుకు ఆసక్తిగల భక్తులు తమను సంప్రదించాలని పూజారి తెలిపారు.