14 July, 2026 | 4:46 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

గానుగబండలో ఘనంగా పాండవులకు బోనాలు

03-10-2025 11:20 PM

ముదిరాజుల ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు పూజలు

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని గానుగబండ గ్రామంలోని ముదిరాజ్ లు విజయ దశమి పర్వదినం సందర్భంగా పాండవులకు బోనాలు సమర్పించారు. గ్రామ దేవతల వద్ద సొరకాయను నరికి ఆయుధ పూజ నిర్వహించారు. పాండవులు వనవాసం చేసినప్పుడు వారి ఆయుధాలను విజయ దశమి నాడు జమ్మి చెట్టు మీద పెట్టీ ఆయుధ పూజ నిర్వహించిన సందర్భంగా వారి గుర్తుగా ప్రతి సంవత్సరం ముదిరాజ్ కులస్తులందరూ డీజే పాటలతో సామూహికంగా బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో ఈద సైదులుతో పాటు ముదిరాజులు గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పలువు పాల్గొన్నారు.