26 May, 2026 | 5:52 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

గానుగబండలో ఘనంగా పాండవులకు బోనాలు

03-10-2025 11:20 PM

ముదిరాజుల ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు పూజలు

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని గానుగబండ గ్రామంలోని ముదిరాజ్ లు విజయ దశమి పర్వదినం సందర్భంగా పాండవులకు బోనాలు సమర్పించారు. గ్రామ దేవతల వద్ద సొరకాయను నరికి ఆయుధ పూజ నిర్వహించారు. పాండవులు వనవాసం చేసినప్పుడు వారి ఆయుధాలను విజయ దశమి నాడు జమ్మి చెట్టు మీద పెట్టీ ఆయుధ పూజ నిర్వహించిన సందర్భంగా వారి గుర్తుగా ప్రతి సంవత్సరం ముదిరాజ్ కులస్తులందరూ డీజే పాటలతో సామూహికంగా బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో ఈద సైదులుతో పాటు ముదిరాజులు గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పలువు పాల్గొన్నారు.