17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రోడ్లపై వ్యర్థాలు వేస్తే రూ.15 వేల ఫైన్

21-11-2025 12:00 AM
  1. నార్సింగిలో ట్రాక్టర్ సీజ్

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి

మణికొండ, నవంబర్ 20 (విజయక్రాంతి) : నార్సింగి పురపాలక సంఘం పరిధిలో రోడ్ల పక్కన నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ వ్యర్థాలను వేస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ టి. కృష్ణమోహన్ రెడ్డి హెచ్చరించారు. కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం పారిశుద్ధ్య పర్యవేక్షణ అధికారి లచ్చిరాం తనిఖీలు నిర్వహిం చారు.

రోడ్డు పక్కన చెత్తను డంప్ చేస్తున్న ఒక ట్రాక్టర్ను అధికారులు పట్టుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు శీను అనే వ్యక్తికి రూ.15,000 జరిమానా విధించారు. ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు రోడ్లపై చెత్తాచెదారం వేయకూడదని, లేనియెడల భారీ జరిమానాలతో పాటు చట్టపర మైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.